ఇక యాక్షన్ షురూ

Follow

విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాథ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. జూలై మొదటివారంలో సెట్స్పైకి వెళ్లనుంది. జెబి మోహన్ పిక్చర్స్ భాగస్వామ్యంలో పూరి కనెక్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నది. ‘దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని మునుపెన్నడూ చూడని విధంగా నవ్యరీతిలో ఆవిష్కరించబోతున్నాడు. వినూత్నమైన కథాంశంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది’ అని చిత్రబృందం పేర్కొంది. సంయుక్త, టబు, విజయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: ఛార్మి, నిర్మాతలు: పూరి జగన్నాథ్, జెబి నారాయణరావు కొండ్రోల్లా, రచన-దర్శకత్వం: పూరి జగన్నాథ్.
విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాథ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. జూలై మొదటివారంలో సెట్స్పైకి వెళ్లనుంది. జెబి మోహన్ పిక్చర్స్ భాగస్వామ్యంలో పూరి కనెక్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నది.