ఉత్తర అమెరికా పర్వతంపై చిక్కుకున్న కేరళ పర్వతారోహకుడు

Follow

తిరువనంతపురం : ఉత్తర అమెరికాలోని డెనలి పర్వతంపై చిక్కుకున్న పర్వతారోహకుడు షేక్ హసన్ ఖాన్ను కాపాడాలని కేరళ నేతలు విదేశాంగ మంత్రిని కోరారు. షేక్ తన శాటిలైట్ ఫోన్ ద్వారా పంపించిన సందేశంలో, తాను, తన బృందం క్యాంప్ 5 వద్ద 17,000 అడుగుల ఎత్తులో తుఫానులో చిక్కుకుపోయామని చెప్పారు. తనను కాపాడాలని, సహాయం చేయాలని కోరారు.
తమ వద్ద ఆహారం, నీరు తక్కువగా ఉన్నాయని తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్’ను నిర్వహించిన భారత దళాలను అభినందిస్తూ ఓ బ్యానర్ను ఎగురవేసేందుకు తాను ఇక్కడికి వచ్చానని తెలిపారు. కేరళ ప్రభుత్వోద్యోగి అయిన షేక్ వివిధ ఖండాల్లోని అనేక పర్వతాలను అధిరోహించారు. 2022లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు.
ఉత్తర అమెరికాలోని డెనలి పర్వతంపై చిక్కుకున్న పర్వతారోహకుడు షేక్ హసన్ ఖాన్ను కాపాడాలని కేరళ నేతలు విదేశాంగ మంత్రిని కోరారు. షేక్ తన శాటిలైట్ ఫోన్ ద్వారా పంపించిన సందేశంలో, తాను, తన బృందం క్యాంప్ 5 వద్ద 17,000 అడుగుల ఎత్తులో తుఫానులో చిక్కుకుపోయామని చెప్పారు.