జేసీ, కేతిరెడ్డి కుటుంబాల మధ్య ఏళ్లనాటి వైరం.. కొడుకులు, మనమళ్ల తరం వచ్చినా..

Follow

అధికారం, అపోజిషన్. రోల్ మారుతుంది. కానీ ఆ ఇద్దరు లీడర్లు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. పవర్లో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా..పౌరుషం కోసం..పట్టు కోసం..ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకోవడం కోసం ఎంతకూ తగ్గడం లేదు. దాంతో తాడిపత్రి రాజకీయం ప్రతీ వారంలో కనీసం రెండు సార్లు అయినా న్యూస్ హెడ్లైన్గా ఉంటోంది. అటు జేసీ ప్రభాకర్రెడ్డి..ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇద్దరు వయసులో పెద్దవారే. ఇంకో మాట చెప్పాలంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి కంటే జేసీ ప్రభాకర్రెడ్డి వయస్సులో ఇంకాస్త పెద్దవారే.
అలా ఆరు పదుల వయసు దాటినా..సీమ పౌరుషం ఏంటో చూపిస్తున్నారు నేతలు. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు గొడవంటే చూపే అత్యుత్సాహం అంతా ఆ ఇద్దరిలో కనిపిస్తోంది. కొడుకులు, మనమళ్లు, మనవరాళ్లు..ఇలా తరం మారిన..వాళ్ల తీరు మాత్రం మారట్లేదు. ఫ్యాంక్షన్ రాజకీయాలకు కాలం చెల్లిన రోజుల్లోనూ..మాటలతోనే కత్తులు దూసుకుంటున్నారు వీళ్లిద్దరు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడపత్రిలో కేతిరెడ్డి తన హవా నడిపించారు. ఏకంగా జేసీ ప్రభాకర్రెడ్డి ఇంటికి వెళ్లి కూర్చుని సవాల్ విసిరారు. అంతటితో ఆగకుండా ఏకంగా జేసీ ప్రభాకర్రెడ్డిని తాడిపత్రి రాకుండా అడ్డుకున్నట్లు సందర్భాలు ఉన్నాయంటున్నారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పొజిషన్స్ చేంజ్ అయ్యాయి. కేతిరెడ్డి అపోజిషన్లోకి వచ్చేశారు.
Also Read: ధోనీ బిగ్ డెసిషన్.. ‘ఆ క్యాప్షన్ నాదే..’ ట్రేడ్ మార్క్కు అప్లై చేసిన కెప్టెన్ కూల్..
జేసీ ప్రభాకర్రెడ్డి అధికారంలో ఉన్నారు. దీంతో రిజల్స్ట్ వచ్చిన మరుక్షణం నుంచే తాడిపత్రి పాలిటిక్స్ కాక రేపుతున్నాయి. అప్పట్లో జరిగిన ఘర్షణ పెద్ద దుమారం లేపింది. ఆ సాకుతో కేతిరెడ్డి తాడిపత్రికి రావడానికి వీళ్లేదంటూ అడ్డుకుంటున్నారు జేసీ ప్రభాకర్రెడ్డి. కోర్టుకెళ్లి మరీ కేతిరెడ్డి అనుమతులు తెచ్చుకున్నారు. అయినా నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు జేసీ ప్రభాకర్రెడ్డి. కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అనుమతించాలంటూ ఇప్పటికే రెండు మూడుసార్లు తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి ప్రయత్నించినా..జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. పోలీసులు అనుమతివ్వలేదు.
జేసీ ప్రభాకర్రెడ్డి, పెద్దారెడ్డి మధ్య డైలాగ్ వార్
ఎలాగోలా ఏడాది తర్వాత తాడిపత్రిలో అడుగుపెట్టారు కేతిరెడ్డి. దీంతో జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరులు, టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అక్కడి నుంచి తరలించారు. ఆ తర్వాత కూడా జేసీ ప్రభాకర్రెడ్డి, పెద్దారెడ్డి మధ్య డైలాగ్ వార్ నడుస్తూనే ఉంది. నీకే కాదు జనం నాకు కూడా ఉన్నారు..87వేల మంది ఓటేశారని పెద్దారెడ్డి అంటుంటే..తాను ఊర్లో లేనప్పుడు వచ్చావని..తాడిపత్రిలోకి అడుగుపెట్టనిచ్చే ప్రసక్తే లేదని జేసీ ప్రభాకర్ రివర్స్ అటాక్ చేస్తున్నారు.
అయితే ఈ ఇద్దరి పంచాయితీ చూసిన జనాలకు అసలు ఎవరిది తప్పు..ఎవరికి ఒప్పు అనేది అర్థం కాని పరిస్థితి. ఎవరు తగ్గరు. ఎవరు చెప్పినా వినరు. తమ మాట నెగ్గాలన్నదే పట్టు. పౌరుషం కోసం ప్రాణాలు పణంగా పెట్టే స్వభావంతో..ఆ ఇద్దరు లీడర్లు కారాలు, మిరియాలు దువ్వుకుంటూనే ఉన్నారు. రోజూ ఈ గొడవేంటని అనుకుని అధినేతలు జోక్యం చేసుకునే పరిస్థితి కూడా లేదంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి చంద్రబాబు..కేతిరెడ్డికి జగన్ సముదాయించే చెప్పేంత సీన్ కూడా ఈ ఇద్దరి విషయంలో కనిపించడం లేదంటున్నారు.
ఎందుకంటే జేసీ, కేతిరెడ్డి ఇద్దరు ఫ్యాంక్షన్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన నేతలు. వాళ్ల తాతల కాలం నుంచే ఇద్దరికి రాజకీయం వైరం. అంతకు మించి ప్రతీకారంతో రగిలిపోతున్న పరిస్థితి. అయితే పరిస్థితులు మారాయి కాబట్టి..భౌతిక దాడులు చేసే ప్రాణాలు తీసుకునేంత వరకు పోకపోయినా..దాడికి ప్రతి దాడి..యాక్షన్కు రియాక్షన్ అన్నది వాళ్ల బ్లడ్లోనే ఉంటుందన్న చర్చ జరుగుతుంది. సీమ నేతల పంచాయితీ తేగేదెప్పుడో..ఈ రాద్దాంతం సద్దుమణిగేదేప్పుడో చూడాలి మరి.
వాళ్ల తాతల కాలం నుంచే ఇద్దరికి రాజకీయం వైరం. అంతకు మించి ప్రతీకారంతో రగిలిపోతున్న పరిస్థితి.