నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ లో పలువురు విద్యార్థులు ఎంపిక..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

అభినందనలు తెలియజేసిన హెడ్మాస్టర్లు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సంజయ్ నగర్ లో గల మున్సిపల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 23 మంది నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కింద ఎంపిక కావడం జరిగిందని ఆ పాఠశాల హెచ్ఎం జ్యోతిలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ తో పాటు ఉపాధ్యాయ బృందం ఆ విద్యార్థినీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా దుర్గా నగర్ లోని శ్రీ గణేష్ ఉన్నత పాఠశాలలో నలుగురు విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ కు ఎంపిక కావడం జరిగిందని పాఠశాల హెడ్మాస్టర్ సంజీవయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జి. హర్షవర్ధన్, పి. యోగానంద్, జె. శిరీష, హుజాపియా(నలుగురు విద్యార్థులు) ఎంపిక పట్ల హెడ్మాస్టర్ తో పాటు ఉపాధ్యాయ బృందం, పాఠశాల కమిటీ, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హెడ్మాస్టర్లు మాట్లాడుతూ ఎంపిక కాబడిన ఈ విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు అనగా నాలుగు సంవత్సరాలు పాటు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం చే స్కాలర్షిప్పులను వారి బ్యాంకు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఎంపిక కాబడిన విద్యార్థులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

The post నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ లో పలువురు విద్యార్థులు ఎంపిక.. appeared first on Visalaandhra.

​అభినందనలు తెలియజేసిన హెడ్మాస్టర్లువిశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సంజయ్ నగర్ లో గల మున్సిపల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 23 మంది నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కింద ఎంపిక కావడం జరిగిందని ఆ పాఠశాల హెచ్ఎం జ్యోతిలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ తో పాటు ఉపాధ్యాయ బృందం ఆ విద్యార్థినీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా దుర్గా నగర్ లోని శ్రీ గణేష్ ఉన్నత పాఠశాలలో నలుగురు విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ కు ఎంపిక కావడం
The post నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ లో పలువురు విద్యార్థులు ఎంపిక.. appeared first on Visalaandhra. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *