బదిలీల ప్రక్రియలో సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేకూర్చండి..
Follow
పట్టణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆవేదన
విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల 28వ తేదీనఅనంతపురంజిల్లా లో వార్డు సచివాలయ ఉద్యోగులకు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు బదిలీలకు సంబంధించిన ప్రక్రియ జరిగింది అని, అందులో ముఖ్యంగా వార్డు సచివాలయం బదిలీలకు సంబంధించి మాకు అన్యాయం జరిగింది పట్టణ సచివాలయ ఉద్యోగులు వాపోయారు. అనంతరం వారు మాట్లాడుతూ అందులో స్పోవుస్ అనే ఆప్షన్ తప్పుగా వినియోగించడం జరిగింది అని, దానివల్ల దాదాపు వందల సంఖ్యలో తర్వాత ర్యాంకుల్లో ఉన్న ఉద్యోగులు నష్టపోయారు అని తెలిపారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము అని తెలిపారు. దానికి సంబంధించి ఆర్డి ఎంఏ పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేకూర్చాలని వారి డిమాండ్ చేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా ( అనంతపురం జిల్లా శ్రీ సత్య సాయి జిల్లా ) హెడ్ క్వార్టర్స్ విషయం, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ట్రాన్స్ఫర్ కు సంబంధించి ఒక్క అనంతపురం జిల్లాలోనే జరిగితే, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏవిధంగా జరిగాయో అర్థం అవుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.
అనేకమంది భార్యాభర్త ఇద్దరు 5 సంవత్సరాలు పూర్తి అయిన వాళ్లు కూడా స్పౌస్ పాత స్టేషన్ ప్రాతిపదికన పెడుతున్నారు. GO ప్రకారం 5 ఏళ్లు నిండిన స్టేషన్ ఆటోమేటిక్ గా ఖాళీగా పరిగణించబడుతుంది అని తెలిపారు. అంతవరకు చేసిన వారు ఏ విధమైన ప్రాధాన్యత క్యాటగిరిలో ఉన్నప్పటికీ పాత స్టేషన్ల వివరాలతో లబ్ధి పొందడానికి అవకాశం లేదు అని స్పష్టం చేశారు. ఇక్కడ భార్యా,భర్త ఇద్దరివి కూడా 5 ఏళ్లు నిండినట్లయితే స్పౌస్ పెట్టే అవకాశం అసలే లేదు అని తెలిపారు.
కానీ వీళ్ళు తెలివిగా ముందు కౌన్సిలింగ్ వెళ్లే వాళ్ళు ఇద్దరికీ ఐదేళ్లు పూర్తయ్యాయి అనే విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టడం సరి అయిన పద్ధతి కాదు అని తెలిపారు. దీనివల్ల ఇతర సచివాలయ ఉద్యోగులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది అని తెలిపారు. అయితే
ప్రయారిటీ కేటగిరిలో ఉద్యోగులను బదిలీలు చేసే క్రమంలో వారు ఏ కేటగిరి లో బదిలీ అవుతున్నారు అన్నది స్పష్టంగా అందరికీ తెలియజేయాలి అని తెలిపారు. నిబంధనను ఉల్లంఘించ రాదని తెలిపారు.సంవత్సరం లోపు భార్యాభర్తలిద్దరూ స్పౌస్ సర్టిఫికేట్ పొందడం ట్రాన్స్ఫర్ గైడ్లైన్స్ కి వ్యతిరేకం అని తెలిపారు.
ఈ విషయమై ఉద్యోగులు ఉన్నతాధికారుల ద్వారా విచారణ జయించి మాకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
The post బదిలీల ప్రక్రియలో సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేకూర్చండి.. appeared first on Visalaandhra.
పట్టణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆవేదనవిశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల 28వ తేదీనఅనంతపురంజిల్లా లో వార్డు సచివాలయ ఉద్యోగులకు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు బదిలీలకు సంబంధించిన ప్రక్రియ జరిగింది అని, అందులో ముఖ్యంగా వార్డు సచివాలయం బదిలీలకు సంబంధించి మాకు అన్యాయం జరిగింది పట్టణ సచివాలయ ఉద్యోగులు వాపోయారు. అనంతరం వారు మాట్లాడుతూ అందులో స్పోవుస్ అనే ఆప్షన్ తప్పుగా వినియోగించడం జరిగింది అని, దానివల్ల దాదాపు వందల సంఖ్యలో తర్వాత ర్యాంకుల్లో ఉన్న ఉద్యోగులు నష్టపోయారు అని
The post బదిలీల ప్రక్రియలో సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేకూర్చండి.. appeared first on Visalaandhra.