భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

భారత్, అమెరికా మధ్య వాణిజ్య ప్రతిష్టంభనకు తెరపడింది. ఇరు దేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ఖరారైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన గడువుకు ఒక్కరోజు ముందే, అంటే జులై 8న దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు భారత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం కొంతకాలంగా వాషింగ్టన్‌లో చర్చలు జరుపుతోంది. ఇరు పక్షాలు అన్ని షరతులకు అంగీకరించడంతో చర్చలు ఫలప్రదమయ్యాయని తెలుస్తోంది. ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలను విధిస్తామని ట్రంప్ ప్రకటించిన గడువు జులై 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. గడువును పొడిగించే అవకాశం లేదని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేయడంతో, ఒప్పందం కుదరడం భారత్‌కు పెద్ద ఊరటనిచ్చినట్లయింది. భారత దిగుమతులపై విధించిన 26 శాతం అదనపు సుంకాలను అమెరికా జులై 9 వరకు తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ అదనపు సుంకాల నుంచి పూర్తి మినహాయింపు పొందాలని భారత్ బలంగా వాదిస్తోంది. ఈ తాత్కాలిక ఒప్పందంలో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఒకరి డిమాండ్లు.. మరొకరి ప్రయోజనాలు
ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా కొన్ని కీలక డిమాండ్లను భారత్ ముందు ఉంచింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), వైన్లు, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, పాలు, పాల ఉత్పత్తులతో పాటు యాపిల్స్, నట్స్ వంటి వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించాలని కోరుతోంది. ముఖ్యంగా పాడి పరిశ్రమ విషయంలో రాయితీలు ఇవ్వడం భారత్‌కు సవాలుగా మారింది. ఇప్పటివరకు ఏ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలోనూ భారత్ ఈ రంగాన్ని తెరవలేదు.మరోవైపు, భారత్ కూడా తమకు ప్రయోజనం కలిగించే అంశాలపై పట్టుబట్టింది. ముఖ్యంగా దేశంలో అధిక ఉపాధి కల్పించే టెక్స్‌టైల్స్, వజ్రాభరణాలు, రెడీమేడ్ దుస్తులు, ప్లాస్టిక్, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటి వంటి ఉత్పత్తులకు అమెరికా మార్కెట్‌లో సుంకాల రాయితీలు కల్పించాలని కోరుతోంది. ఈ తాత్కాలిక ఒప్పందం ఈ ఏడాది అక్టోబర్ నాటికి కుదరబోయే సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి (బీటీఏ) తొలి అడుగు అని భావిస్తున్నారు. వాణిజ్య అడ్డంకులన్నింటినీ తొలగించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించడం ఈ ఒప్పందానికి సానుకూల సంకేతాలను ఇచ్చింది.

The post భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు! appeared first on Visalaandhra.

​భారత్, అమెరికా మధ్య వాణిజ్య ప్రతిష్టంభనకు తెరపడింది. ఇరు దేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ఖరారైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన గడువుకు ఒక్కరోజు ముందే, అంటే జులై 8న దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు భారత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం కొంతకాలంగా వాషింగ్టన్‌లో చర్చలు జరుపుతోంది. ఇరు పక్షాలు అన్ని షరతులకు
The post భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు! appeared first on Visalaandhra. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *