మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలు ఏర్పాటు చేయండి

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

– ఇసుక విక్రయ కేంద్రాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయాలి
– సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలు ప్రతిరోజు సమీక్షించాలి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నేపథ్యంలో సామాన్యులకు సిమెంటు, స్టీల్, ఇటుకలు, ఇసుక అందుబాటులో ఉండేందుకు మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలు సమావేశమై ధరలు నిర్ణయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రెవిన్యూ రిసోర్స్ మొబ లైజేషన్ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు సబ్ కమిటీ సభ్యులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రగతిపై శాఖల వారీగా మొదట మంత్రుల బృందం సమీక్షించింది. సామాన్యులకు ఇసుక రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉండాలన్న నిర్ణయం గత సమావేశంలో జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 20 కేంద్రాల్లో ఇసుక విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు వివరించారు. కాగా మార్కెట్ యార్డులు, ప్రభుత్వ స్థలాల్లో త్వరితగతిన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సామాన్యులకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని సబ్ కమిటీ సభ్యులు అధికారులకు సూచించారు. LRS దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రుల బృందం చర్చించింది. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భూముల బేసిక్ విలువను పెంచితే దరఖాస్తుదారులు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు మంత్రుల బృందానికి సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా గిరిజనులే ఇసుక క్వారీలు నిర్వహించేందుకు చేపట్టిన చర్యలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రజలపై పన్ను భారం మోపకుండా ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం, సబ్ కమిటీ చైర్మన్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ రిసోర్స్ మొబలైజేషన్ సబ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రతిరోజు సమీక్ష నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సబ్ కమిటీలో చర్చించిన విషయాల్లో ప్రగతి కనబరచాలని ఈ క్రమంలో అధికారులకు ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే తనతో నేరుగా సంప్రదించి ఫైళ్ల కదలికలో వేగం పెంచాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరంలోని కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించే కార్యక్రమం పై పారిశ్రామిక వాడల వారీగా సబ్ కమిటీ అధికారులతో సమీక్ష నిర్వహించింది. మైన్స్ మరియు జియాలజీ శాఖలో అమల్లో ఉన్న వన్ టైం సెటిల్మెంట్ ప్రగతిని సబ్ కమిటీ సభ్యులు సమీక్షించారు. కమర్షియల్ ట్యాక్స్ విభాగానికి వస్తే దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం పరిస్థితి మెరుగైన స్థితిలో ఉందని సబ్ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ, మైన్స్ అండ్ జియాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, కమిషనర్లు శశాంక, హరిత, హరి కిరణ్, గౌతం, సురేంద్రమోహన్ హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు

The post మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలు ఏర్పాటు చేయండి appeared first on Navatelangana.

​– ఇసుక విక్రయ కేంద్రాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయాలి– సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలు ప్రతిరోజు సమీక్షించాలి– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లున‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నేపథ్యంలో సామాన్యులకు సిమెంటు, స్టీల్, ఇటుకలు, ఇసుక అందుబాటులో ఉండేందుకు మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలు సమావేశమై ధరలు నిర్ణయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రెవిన్యూ రిసోర్స్ మొబ లైజేషన్ సమావేశం జరిగింది.
The post మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలు ఏర్పాటు చేయండి appeared first on Navatelangana. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *