మృతి చెందిన కార్మికులకు రూ.కోటి పరిహారం చెల్లించాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య

Follow
నవతెలంగాణ-పాశమైలారం : పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి భద్రతా చర్యలు పాటించని యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య అన్నారు.
సంగారెడ్డి జిల్లా, పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని సీగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలిన ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతాన్ని వీరయ్య సీఐటీయు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములుతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. కోటికి తగ్గకుండా పరిహారం చెల్లించాలని, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50లక్షలు అందించడంతో పాటు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఈ ప్రమాదంపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని అన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న రాష్ట్ర మంత్రులు దామోదర రాజ నర్సింహా, వివేక్ వెంకట స్వామిలు ఎలాంటి పరిహారం ప్రకటించకుండానే వెళ్లిపోవడం ప్రభుత్వ బాధ్యతారహిత్యానికి నిదర్శనం అని అన్నారు. అనంతరం సీఐటీయు అధ్యక్షులు చుక్కా రాములు మాట్లడుతూ.. పరిశ్రమల శాఖ, ప్యాక్టరిల శాక యాజమాన్యాలతో కుమ్మకై కార్మికుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం వహించడం ఇలాంటి విషాదాలకు దారి తీస్తుందన్నారు. నాణ్యత లేని రియక్టర్లు వాడటమే కాక స్కిల్డ్ వర్కర్లను కాకుండా వలస కార్మికులను వీటిలో పని చేయిస్తున్నారని తెలిపారు. వీటన్నటిని కారణంగా ఇంత పెద్ద విషాదం చోటు చేసుకుందని వాపోయారు. కనీస కార్మికుల చట్టాలను అమలు చేసి కార్మికులకు తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతి చెందిన కార్మికులకు వీరయ్య, రాములు తీవ్ర సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


The post మృతి చెందిన కార్మికులకు రూ.కోటి పరిహారం చెల్లించాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య appeared first on Navatelangana.
నవతెలంగాణ-పాశమైలారం : పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి భద్రతా చర్యలు పాటించని యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా, పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని సీగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలిన ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతాన్ని వీరయ్య సీఐటీయు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములుతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. కోటికి
The post మృతి చెందిన కార్మికులకు రూ.కోటి పరిహారం చెల్లించాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య appeared first on Navatelangana.