లక్ష చెస్‌ బోర్డుల పంపిణీ లక్ష్యంగా..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Chess Network

హైదరాబాద్‌, ఆట ప్రతినిధి : పాలమూరు ఎన్‌ఆర్‌ఐ నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో మొదలైన చెస్‌నెట్‌వర్క్‌ బృహత్తర కార్యక్రమానికి సిద్ధమైంది. తెలంగాణ గ్రామీణ, గిరిజన, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను మరింత తీర్చిదిద్దే ఉద్దేశంతో గొప్ప ఆలోచనతో ముందుకువచ్చింది. ఆదివారం రవీంద్రభారతి వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెస్‌ నెట్‌వర్క్‌ సహయంతో తెలంగాణ వ్యాప్తంగా లక్ష చెస్‌ బోర్డులు పంపిణీ చేసేందుకు పాలమూరు ఎన్‌ఆర్‌ఐ ఫోరం ప్రతినిధులు ముందుకువచ్చారు.

చెస్‌ ద్వారా రాష్ట్రంలోని ప్రతిభ కల్గిన నిరుపేద విద్యార్థులకు అండగా నిలువాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు కావాల్సిన ఆలోచన, శక్తి సామర్థ్యాలను చెస్‌ ద్వారా అలవరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా చెస్‌ బోర్డులను పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వేదకుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొనగా, ఎన్‌ఆర్‌ఐ ఫోరం ప్రతినిధులు సుధీర్‌, రవిమేరెడ్డి, శ్రీధర్‌, మదన్‌మోహన్‌, సంజయ్‌కుమార్‌, కందిరవి, విమల పాల్గొన్నారు.

​పాలమూరు ఎన్‌ఆర్‌ఐ నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో మొదలైన చెస్‌నెట్‌వర్క్‌ బృహత్తర కార్యక్రమానికి సిద్ధమైంది. తెలంగాణ గ్రామీణ, గిరిజన, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను మరింత తీర్చిదిద్దే ఉద్దేశంతో గొప్ప ఆలోచనతో ముందుకువచ్చింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *