వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

నవతెలంగాణ – జుక్కల్

జుక్కల్ మండల కేంద్రంలోని బస్వాపూర్ వెళ్లే దారి దగ్గర ఉన్న దర్గా వద్ద కమ్యూనిటీ ప్లాంటేషన్ కేంద్రంలో జుక్కల్ ఎమ్మెల్యే వనమోహత్సవ కార్యక్రమాన్ని సోమవారం నాడు ఉపాధిహామీ ఏపీవో తులసీరామ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు పాల్గొని కార్యక్రమం ప్రారంభోత్సవంలో మొక్కలను నాటి స్థానిక అధికారులతో మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జుక్కల్ మండలంలోని 30 గ్రామ పంచాయతీలలో 30 నర్సరీలు ఉన్నాయని తెలిపారు. ఏపీవో తులసిరాం మాట్లాడుతూ మండలంలోని అన్ని నర్సరీ లలో  వనమోహత్సవ కార్యక్రమానికి మొక్కలు పెంపకం చేసి రెడీ చేసి పెట్టామని తెలిపారు. వాటిని నాటడం తరువాయి అని అన్నారు. జూలై 1వ తేదీ నుండి వరమోహత్సవ కార్యక్రమాలు నెలరోజుల పాటుకొనసాగుతుందని పేర్కొన్నారు.  అన్ని గ్రామాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పండుగ వాతావరణం లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేతో పాటు జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ , ఉపాధి హామీ ఎపిఓ  టీఏలు రమేష్  , రవీందర్ , అశోక్ గౌడ్,  ఎఫ్ఏ లు , స్థానిక కాంగ్రెస్ నాయకులు,   తదితరులు పాల్గొన్నారు.

The post వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే appeared first on Navatelangana.

​నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండల కేంద్రంలోని బస్వాపూర్ వెళ్లే దారి దగ్గర ఉన్న దర్గా వద్ద కమ్యూనిటీ ప్లాంటేషన్ కేంద్రంలో జుక్కల్ ఎమ్మెల్యే వనమోహత్సవ కార్యక్రమాన్ని సోమవారం నాడు ఉపాధిహామీ ఏపీవో తులసీరామ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు పాల్గొని కార్యక్రమం ప్రారంభోత్సవంలో మొక్కలను నాటి స్థానిక అధికారులతో మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జుక్కల్ మండలంలోని 30 గ్రామ పంచాయతీలలో 30 నర్సరీలు
The post వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే appeared first on Navatelangana. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *