వర్షాకాలంలో చెవి, ముక్కు, గొంతు సమస్యలే అధికం
Follow
అప్రమత్తంగా ఉండాలి.. జాగ్రత్తలు తీసుకోవాలి
ద్వారక ఈ ఎన్ టి హాస్పిటల్, ఈ ఎన్ టి స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ రెడ్డి
నవతెలంగాణ-కంఠేశ్వర్
వర్షాకాలంలో చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు ఎక్కు వగా వచ్చే అవకాశం ఉన్నదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ ఎన్ టి స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ రెడ్డి అన్నారు. వర్షాకాలంలో వాతావరణం, తేమగా ఉండడంతోపాటు తక్షణ వాతావరణ మార్పులు, నీటి కాలుష్యం వలన సమస్యలు ఎదురవుతుంటాయి. కలుషిత నీటిని తాగడంతో గొంతుకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. వర్షాల ప్రభావంతో కీటకాలు ఎక్కువగా వ్యాప్తి చెందుతూ అనారోగ్యాల పాలవుతుంటారు. వర్షం నీరు చెవిలోకి చేరడం వలన (ఓటోమైకోసిస్) చెవుల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంటుందని, ఫంగస్ చెవిలో పెరిగి అదే పెద్దదైతే చెవికి రంధ్రాలు పడే ప్రమాదం కూడా ఉంటుందన్నారు. కాబట్టి ముందుగానే చెవిలోకి నీరు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫోటో మైక్రోసిస్ వ్యాధి చెవిలో సంక్రమిస్తే అంత తొందరగా తగ్గదన్నారు. చెవుల్లోకి కీటకాలు ప్రవేశించడం వలన తీవ్రమైన చెవి నొప్పి వస్తుందన్నారు. చెవి నిర్మాణం పువ్వుని పోలినట్టు ఉండడం వలన చెవిలోకి కీటకాలు ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుందనిన్నారు. ఒకసారి చెవిలోకి వెళ్ళినప్పుడు బయటకు వచ్చేందుకు ప్రయత్నించే క్రమంలో చెవికి గాయం చేస్తుందని, అలాంటప్పుడు కర్ణభేరి కూడా గాయం అయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చెవిలో నీరు పోసుకుని కాసేపు తలవాల్చితే నీటిలో పురుగు చనిపోతుందని తదనంతరం దగ్గరలోని ఆసుపత్రిలోకి వెళ్లి దాన్ని చెవిలో నుండి బయటకు తీసేయవచ్చన్నారు. చెవులలో కీటకాలు చేరినప్పుడు నూనె లాంటివి వేయకూడదన్నారు. వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ వలన ఎక్కువగా జలుబు, నోస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందని, ప్రజలు మాస్క్ ధరించి దీని బారి నుండి తప్పించుకోవచ్చన్నారు. దాంతో పాటు వేడి నీళ్లతో ఆవిరి పట్టడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుందన్నారు. ఇక గొంతు నొప్పి రాకుండా ఉండేందుకు కొన్ని ఆహారపు ఆలవాట్లను మార్చుకోవడంతో పాటు అయిల్ ఫుడ్ ని దూరం పెట్టాలని సూచించారు. ఆహారం తిన్న వెంటనే నోటిని శుభ్రంగా కడుక్కోవాలని, ఉప్పు నీటిని వాడితే మంచి ఫలితం ఉంటుందన్నారు. కొన్ని చిన్నపాటి జాగ్రత్తలతో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల భారీ నుండి తప్పించుకోవచ్చు అని సూచించారు.
The post వర్షాకాలంలో చెవి, ముక్కు, గొంతు సమస్యలే అధికం appeared first on Navatelangana.
అప్రమత్తంగా ఉండాలి.. జాగ్రత్తలు తీసుకోవాలి ద్వారక ఈ ఎన్ టి హాస్పిటల్, ఈ ఎన్ టి స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ రెడ్డి నవతెలంగాణ-కంఠేశ్వర్ వర్షాకాలంలో చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు ఎక్కు వగా వచ్చే అవకాశం ఉన్నదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ ఎన్ టి స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ రెడ్డి అన్నారు. వర్షాకాలంలో వాతావరణం, తేమగా ఉండడంతోపాటు తక్షణ వాతావరణ మార్పులు, నీటి కాలుష్యం వలన సమస్యలు ఎదురవుతుంటాయి. కలుషిత నీటిని తాగడంతో గొంతుకు
The post వర్షాకాలంలో చెవి, ముక్కు, గొంతు సమస్యలే అధికం appeared first on Navatelangana.