హామీల అమలుకు కమిటీ వేయండి : జస్టిస్ చంద్రకుమార్​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

హామీల అమలుకు కమిటీ వేయండి : జస్టిస్ చంద్రకుమార్

Caption of Image.
  • జస్టిస్ చంద్రకుమార్

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించి ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని జస్టిస్ చంద్రకుమార్ కోరారు. ఉద్యమకారులు, నిరుద్యోగులతో చెలగాటం ఆడొద్దన్నారు. బుధవారం బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్ అధ్యక్షతన రాష్ట్ర ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జస్టిస్ చంద్రకుమార్, పాశం యాదగిరి, అరుణోదయ విమలక్క, సాంస్కృతిక సమాఖ్య చైర్మన్ వెన్నెల గద్దర్ హాజరై మాట్లాడారు. 

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉద్యమకారులను ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. కేసులను ఎత్తివేయడంతోపాటు అమరుల కుటుంబాలకు ఉద్యోగంతో పాటు రూ.25 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఉద్యమకారుల గుర్తింపు కోసం చట్టబద్ధమైన కమిటీని నియమించి మార్గదర్శకాలను ప్రకటించాలన్నారు. ఉద్యమకారులకు బస్సులు, రైళ్లలో ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు. 

©️ VIL Media Pvt Ltd.

​హామీల అమలుకు కమిటీ వేయండి : జస్టిస్ చంద్రకుమార్  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *