నక్సలైట్లను చంపగలరేమో.. నక్సలిజాన్ని చంపలేరు : సీపీఐ నారాయణ

Follow

హైదరాబాద్ : నక్సలైట్లతో చర్చలు ఉండవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. నక్సలైట్లను చంపగలరేమోగానీ నక్సలిజాన్ని అంతం చేయలేరని అన్నారు. వచ్చే ఏడాది మార్చిలోగా నక్సలిజాన్ని అంతం చేస్తామన్న అమిత్ షా వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవాచేశారు.
ఈ మేరకు సోమవారం ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా పర్యటలో భాగంగా మాట్లాడిన అమిత్ షా నక్సలైట్లు తక్షణమే హింసను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. నక్సలైట్లు గిరిజన బిడ్డలను, పోలీసులను చంపినప్పుడు వారి తరఫున ఎవరూ మాట్లాడలేదు గానీ.. ఇప్పుడు చర్చల కోసం చాలామంది పిలుపునిస్తున్నారని దుయ్యబట్టారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 10 వేల మంది నక్సలైట్లు లొంగిపోయారన్నారు. ఆయుధాలు వీడేదాక వారితో చర్చలు ఉండవని అమిత్ షా అన్నారు. ఈ నేపథ్యంలో నారాయణ స్పందించారు.
నక్సలైట్లతో చర్చలు ఉండవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు.