ENG vs IND : ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు.. య‌శ‌స్వి జైస్వాల్‌తో షాహిద్ అఫ్రిది, రోహిత్ శర్మ రికార్డులకు ప్రమాదం

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Yashasvi Jaiswal

ఎడ్జ్‌బాస్టన్ వేదిక‌గా జూలై 2 నుంచి భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు ఆరంభానికి ముందు య‌శ‌స్వి జైస్వాల్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ గ‌నుక 10 సిక్స‌ర్లు బాదితే టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 50 సిక్స‌ర్లు బాదిన ఆట‌గాడి చ‌రిత్ర సృష్టిస్తాడు.

ప్ర‌స్తుతం ఈ రికార్డు పాకిస్థాన్ మాజీ ఆట‌గాడు షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 46 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘ‌న‌త సాధించాడు. ప్ర‌స్తుతం య‌శ‌స్వి 38 ఇన్నింగ్స్‌ల్లో 40 సిక్స‌ర్లు కొట్టాడు. రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో జైస్వాల్ 10 సిక్స‌ర్లు కొట్ట‌డంలో విఫ‌ల‌మైనా కూడా అఫ్రిది రికార్డును బ్రేక్ చేసేందుకు అత‌డికి మొత్తం ఏడు ఇన్నింగ్స్‌లు ఛాన్స్ ఉంది. దీంతో అత‌డు ఖ‌చ్చితంగా అఫ్రిది రికార్డును బ్రేక్ చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

Faf Du Plessis : చ‌రిత్ర సృష్టించిన ఫాఫ్ డుప్లెసిస్‌.. ప్ర‌పంచ క్రికెట్‌లో తొలి ఆట‌గాడు ఇత‌డే.. ఎవ్వ‌రి వ‌ల్ల కాలేదు..

ఇక ఈ జాబితాలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ రెండో స్థానంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్ 30 మ్యాచ్‌ల్లో 51 ఇన్నింగ్స్‌ల్లో 50 సిక్స‌ర్లు కొట్టాడు. టిమ్ సౌథీ 36 మ్యాచ్‌ల్లో 60 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘ‌న‌త సాధించాడు.

టెస్టు క్రికెట్‌లో ఇన్నింగ్స్‌ల ప‌రంగా అత్యంత వేగంగా 50 సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్లు వీరే..

షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్) – 46 ఇన్నింగ్స్‌లు
రోహిత్ శ‌ర్మ (భార‌త్‌) – 51 ఇన్నింగ్స్‌లు
టిమ్ సౌథీ (న్యూజిలాండ్‌) – 60 ఇన్నింగ్స్‌లు
ఆండ్రూ ఫింటాఫ్ (ఇంగ్లాండ్‌) – 71 ఇన్నింగ్స్‌లు
ఆడ‌మ్ గిల్ క్రిస్ట్ (ఆస్ట్రేలియా) – 74 ఇన్నింగ్స్‌లు
మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా) – 75 ఇన్నింగ్స్‌లు

MCL 2025 : 7 మ్యాచ్‌ల్లో 6 ఓట‌మి.. ఏ టోర్న‌మెంట్ అయినా ఎంఐ అంత త్వ‌ర‌గా నిష్ర్క‌మించ‌దు.. నికోల‌స్ పూర‌న్ కామెంట్స్‌..

య‌శ‌స్వి జైస్వాల్ ఇప్ప‌టి వ‌ర‌కు 20 టెస్టులు ఆడాడు. 38 ఇన్నింగ్స్‌లలో 1903 పరుగులు చేశాడు. ఇందులో 5 శ‌త‌కాలు, 10 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. టెస్టుల్లో రెండు వేల ప‌రుగుల మైలురాయిని చేరుకునేందుకు అత‌డికి 93 ప‌రుగులు అవ‌స‌రం.

ఎడ్జ్‌బాస్టన్‌లో భార‌త రికార్డు బాలేదు..

రెండో టెస్టుకు వేదికైన ఎడ్జ్‌బాస్ట‌న్‌లో టీమ్ఇండియా రికార్డు అస్సలు బాలేదు. ఈ మైదానంలో భార‌త్ 8 టెస్టులు ఆడ‌గా 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక్క మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.

 

​య‌శ‌స్వి జైస్వాల్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *