Karnataka | కర్నాటకకు రణదీప్ సుర్జేవాలా.. ముఖ్యమంత్రి మార్పు తప్పదా..?

Follow

Karnataka | కాంగ్రెస్ ఇన్చార్జి, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రణ్దీప్ సింగ్ సోమవారం కర్నాటకలో పర్యటిస్తున్నారు. బెంగళూరులో ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. సుర్జేవాలా పర్యటన నేపథ్యంలో కలక మార్పులు జరగవచ్చన్న ప్రచారం జరుగుతుంది. అయితే, ఆయన పర్యటన కన్నడ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో హోం మంత్రి జీ పరమేశ్వర సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. రణదీప్ సుర్జేవాలా పర్యటన గురించి తనకేం తెలియదన్నారు. ఆయన పర్యటనపై ప్రశ్నించగా.. జిల్లా పంచాయతీ, తాలూక పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయన వాటిపై చర్చించే అవకాశం ఉందన్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తిన సమయంలో చాలాసార్లు హైకమాండ్ జోక్యం చేసుకుంటుందని.. ఇది వారి పనేనన్నారు.
అయితే, కర్నాటక కాంగ్రెస్లో కొద్దిరోజులుగా నాయకత్వ మార్పు చర్చ జరుగుతుండడం విశేషం. ముఖ్యమంత్రి పీఠంపై డీకే శివకుమార్, సీఎం సిద్ధరామయ్య మధ్య రెండున్నరేళ్లు ఉంటారన్న ఊహాగానాలు రాగా.. ఈ నేపథ్యంలో సుర్జేవాలా పర్యటన ఆసక్తికరంగా మారింది. డీకే శివకుమార్ త్వరలోనే కర్నాటక సీఎంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని పలు నివేదికలు తెలిపాయి. రణదీప్ సుర్జేవాలా, పార్టీలో మార్పులపై సిద్ధరామయ్యను ప్రశ్నించగా.. తమ ప్రభుత్వం బలంగా ఉందన్నారు. పూర్తిస్థాయిలో ఐదేళ్లు కొనసాగుతుందన్నారు. మనందరం కలిసి నడుస్తామన్నారు. పార్టీని గాడిన పెట్టేందుకు సుర్జేవాలా రాష్ట్రానికి వస్తున్నారు.
డీకే శివకుమార్ తాను ఇద్దరం కలిసే ఉన్నామని.. అబద్ధాలను వ్యాప్తి చేయడంలో బీజేపీ ప్రసిద్ధి చెందిందని విమర్శించారు. ఇదిలా ఉండగా మంత్రి కేఎస్ రాజన్న ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్నాటక, జాతీయ రాజకీయాల విషయానికి వస్తే సెప్టెంబర్ తర్వాత పెద్ద మార్పులుంటాయన్నారు. 75 సంవత్సరాలు నిండిన వారు ప్రభుత్వ పదువులు నిర్వహించలేరని గుర్తుంచుకోవాలని.. ఇది బీజేపీ, సంఘ్ విధానమన్నారు. దాంతో దేశానికి కొంత ప్రధాని రావొచ్చని.. కర్నాటక కాంగ్రెస్ పార్టీలో కూడా మార్పు డిమాండ్ ఉందని.. చాలా మంది మంత్రులు కావాలని కోరుకుంటున్నారన్నారు. చాలా మందికి వారి సొంత ఎజెండాలున్నాయని.. అవి సెప్టెంబర్ తర్వాత రూపుదిద్దుకుంటాయని రాజన్న పేర్కొన్నారు.
Karnataka | కాంగ్రెస్ ఇన్చార్జి, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రణ్దీప్ సింగ్ సోమవారం కర్నాటకలో పర్యటిస్తున్నారు. బెంగళూరులో ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. సుర్జేవాలా పర్యటన నేపథ్యంలో కలక మార్పులు జరగవచ్చన్న ప్రచారం జరుగుతుంది.