AI-ఆప్టిమైజ్ చేయబడిన డేటా సెంటర్‌ల విస్తరణను వేగవంతం

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

నవతెలంగాణ హైదరాబాద్: భారతదేశపు మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ AI మౌలిక సదుపాయాల ప్లాట్‌ఫామ్ డెవలపర్ ఉర్సా క్లస్టర్స్, తన తదుపరి దశ వృద్ధిని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సాంకేతిక నాయకుల నియామకాన్ని నేడు ప్రకటించింది. కంపెనీ పలు రాష్ట్రాలలో AI-ఆప్టిమైజ్ చేయబడిన డేటా సెంటర్‌ల నెట్‌వర్క్‌ను నిర్మిస్తుండడంతో, కొత్త నాయకత్వం భారతదేశ AI పరివర్తనను వేగవంతం చేసేందుకు ప్రపంచ అనుభవాన్ని, లోతైన డొమైన్ నైపుణ్యాన్ని తీసుకువస్తుంది.

కొత్త నియామకాలలో ఎరిక్ వార్నర్ ఉండగా, ఆయన చీఫ్ రెవెన్యూ ఆఫీసర్‌గా చేరారు. సన్ మైక్రోసిస్టమ్స్, BEA సిస్టమ్స్, RSA సెక్యూరిటీలలో నాలుగు దశాబ్దాలకు పైగా ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ నాయకత్వాన్ని తీసుకువచ్చారు. అధిక-పనితీరు గల మౌలిక సదుపాయాల కోసం డిమాండ్ పెరుగుతూనే ఉండడంతో, వార్నర్ హైపర్‌స్కేల్ క్లౌడ్ ప్రొవైడర్లు, AI-ఫస్ట్ ఎంటర్‌ప్రైజెస్‌లతో కంపెనీ వాణిజ్య భాగస్వామ్యాలకు నాయకత్వం వహించనున్నారు. తన నియామకం గురించి ఎరిక్ వార్నర్ మాట్లాడుతూ, ‘‘భారతదేశం AI మౌలిక సదుపాయాలకు తదుపరి సరిహద్దును సూచిస్తుంది. ఇక్కడ డిమాండ్ సరఫరా కన్నా చాలా ఎక్కువగా పెరుగుతోంది. భూమి, శక్తి, అనుమతులకు సంబంధించి ఉర్సా క్లస్టర్స్ ముందస్తు అమలు ఈ తదుపరి డిజిటల్ పరివర్తన తరంగానికి నాయకత్వం వహించడానికి ప్రత్యేకంగా స్థానం కల్పిస్తుంది’’ అని వివరించారు.

ప్రపంచ మార్కెట్లలో GPU-ఆప్టిమైజ్ చేసిన AI మౌలిక సదుపాయాలను అమలు చేయడంలో లోతైన నైపుణ్యం కలిగిన NVIDIA డేటా సెంటర్ మాజీ అనుభవజ్ఞులైన ”ఉడు టెక్నాలజీస్“ నుంచి అలెక్స్ సాడో (Tsado) , కీత్ డైన్స్ చేరికతో కంపెనీ మరింత బలోపేతం చేయబడింది.

అలెక్స్ గతంలో NVIDIAలో క్లౌడ్ AI, HPC గో-టు-మార్కెట్ వ్యూహానికి నాయకత్వం వహించారు. కంపెనీ వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపార ఛానెల్‌ను నడిపించి, అమెరికా, చైనా వ్యాప్తంగా ప్రధాన క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లలో GPU లాంచ్‌లను నడిపించారు. కీత్ 30 ఏళ్లకు పైగా డేటా సెంటర్ అనుభవాన్ని తీసుకురావడంతో పాటు, దాని ప్రైవేట్ క్లౌడ్ , ఆర్ &డి టెస్ట్ ల్యాబ్‌ల కోసం సైట్ ఎంపిక, లీజింగ్ , నిర్మాణ నిర్వహణలో NVIDIA ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తారు.

The post AI-ఆప్టిమైజ్ చేయబడిన డేటా సెంటర్‌ల విస్తరణను వేగవంతం appeared first on Navatelangana.

​నవతెలంగాణ హైదరాబాద్: భారతదేశపు మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ AI మౌలిక సదుపాయాల ప్లాట్‌ఫామ్ డెవలపర్ ఉర్సా క్లస్టర్స్, తన తదుపరి దశ వృద్ధిని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సాంకేతిక నాయకుల నియామకాన్ని నేడు ప్రకటించింది. కంపెనీ పలు రాష్ట్రాలలో AI-ఆప్టిమైజ్ చేయబడిన డేటా సెంటర్‌ల నెట్‌వర్క్‌ను నిర్మిస్తుండడంతో, కొత్త నాయకత్వం భారతదేశ AI పరివర్తనను వేగవంతం చేసేందుకు ప్రపంచ అనుభవాన్ని, లోతైన డొమైన్ నైపుణ్యాన్ని తీసుకువస్తుంది. కొత్త నియామకాలలో ఎరిక్ వార్నర్ ఉండగా, ఆయన చీఫ్
The post AI-ఆప్టిమైజ్ చేయబడిన డేటా సెంటర్‌ల విస్తరణను వేగవంతం appeared first on Navatelangana. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *