Bhoodan Pochampally : చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలి : కొంక లక్ష్మీనారాయణ

Follow

భూదాన్ పోచంపల్లి, జూన్ 30 : ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలని చేనేత నాయకుడు కొంక లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం భూదాన్ పోచంపల్లిలో పద్మశాలి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికుల రుణమాఫీకి ప్రభుత్వం జీఓ జారీ చేసినా నేటికీ రుణమాఫీ కాక నిబంధనల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. జియో ట్యాగ్ కలిగిన అర్హులైన చేనేత కార్మికులకు చేనేత సహకార సంఘంలో నూతనంగా సభ్యత్వాలు ఇచ్చిన తర్వాతే సహకార సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని, త్రిఫ్ట్ పథకంలో అర్హులైన వారు చాలామంది ఉన్నారని, వారందరికీ న్యాయం చేయాలని కోరారు. అభయ హస్తం పథకంలో అందరికీ యారన్ సబ్సిడీ ఇవ్వాలని, అర్హులైన వారందరికీ కొత్తగా జియో ట్యాగ్ నెంబర్లు తక్షణమే ఇచ్చి ప్రభుత్వ పథకాలు లబ్ధి చేకూర్చాలని కోరారు. దీక్షకు మద్దతుగా రాష్ట్ర చేనేత జన సమాఖ్య అధ్యక్షుడు చింతకింది రమేశ్, మాజీ కౌన్సిలర్ గుండు మదు, సిపిఐ పట్టణ కార్యదర్శి మిరియాల కృష్ణమూర్తి, బీఆర్ఎస్ నాయకులు చింతకింది కిరణ్, సీత శ్రవణ్, గుండు ప్రవీణ్, సిద్ధగోని ప్రభాకర్, సీత చంద్రయ్య పాల్గొన్నారు.
ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలని చేనేత నాయకుడు కొంక లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం భూదాన్ పోచంపల్లిలో పద్మశాలి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన మాట్లాడారు.