Chandigarh: 13 లక్షల మంది నివాసితులు.. 14.27 లక్షల వాహనాలు.. చండీఘడ్లో మనుషల కన్నా వాహనాలే ఎక్కువ

Follow

చండీఘడ్: దేశంలో అత్యధిక వాహన సాంద్రత కలిగిన నగరంగా చండీఘడ్(Chandigarh) నమోదు అయ్యింది. ఆ సిటీలో మనుషుల కన్నా ఎక్కువ సంఖ్యలో వాహనాలు ఉన్నాయి. గడిచిన అయిదేళ్లలో ఆ నగరం నుంచి సుమారు 2.03 లక్షల కొత్త వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. ఇప్పటి వరకు ఆ సిటీలో రిజిస్టర్ అయిన వాహనాల సంఖ్య 14.27 లక్షలు చేరుకున్నది. ఆ సిటీ జనాభాతో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువ. చండీఘడ్ జనాభా ప్రస్తుతం 13 లక్షలుగా ఉన్నది.
2020, జనవరి ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది మే 31వ తేదీ వరకు సిటీలో 2,02,667 వెహికిల్స్ రిజిస్టర్ చేశారు. ప్రతి నెల కొత్తగా సగటును సుమారు 3118 వాహనాలు సిటీ రోడ్లపైకి వస్తున్నాయి. రోజు వారీ సగటు 104 వాహనాలుగా ఉంది. 2020 నుంచి అందుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం ప్రతి రోజు సగటున 104 వాహనాలు రిజిస్టర్ అవుతున్నట్లు డిప్యూటీ కమీషనర్ నిశాంత్ కుమార్ యాదవ్ తెలిపారు.
కొత్త వాహనాలే కాదు.. 15 ఏళ్ల వయసు దాటిన వాహనాలకు రిజిస్ట్రేషన్ పొడిగించే ప్రక్రియ కూడా చండీఘడ్లో వేగవంతగా సాగుతోంది. 2024లో సుమారు 20 వేల వాహనాలకు ఎక్స్టెన్షన్ ఇచ్చినట్లు అధికారులు చెప్పారు. గత అయిదేళ్లతో పోలిస్తే, గత ఏడాది ఆ రికార్డు నమోదు అయ్యింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 9వేల పాత వాహనాలకు ఎక్స్టెన్షన్ రిజిస్ట్రేషన్ చేశారు. 2023లో సుమారు 16,600 కాలం చెల్లిన వాహనాలకు, 2022లో 11,775, 2021లో 10,784, 2020లో 7832 వామనాలకు ఎక్స్టెన్షన్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఫ్యాన్సీ నెంబర్ల రిజిస్ట్రేషన్ కోసం కూడా సిటీలో డిమాండ్ ఉన్నది. CH01CZ0001 వాహన రిజిస్ట్రేషన్ నెంబర్కు ఇటీవల ఓ వ్యక్తి 31 లక్షలు చెల్లించాడు. రిజిస్టరింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ(ఆర్ఎల్ఏ) గత అయిదేళ్లలో 38 వేల ఫ్యాన్సీ నెంబర్లు అమ్మేసి దాని నుంచి సుమారు 57 కోట్లు ఆర్జించింది. వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సుల జారీ, వాహన పర్మిట్లు, రోడ్డు పన్ను వసూల్ లాంటి సేవలతో సుమారు 1262 కోట్లు ఆర్జించించినట్లు తెలుస్తోంది. గత అయిదేళ్లో 63096 మందికి కొత్త డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేశారు.
Chandigarh: చండీఘడ్లో మనుషుల కన్నా వాహనాలే ఎక్కువ ఉన్నాయి. ఆ సిటీ వెహికిల్ డెన్సిటీలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. నగరంలో 13 లక్షల మంది నివాసితులు ఉండగా, సుమారు 14.27 లక్షల వాహనాలు ఉన్నట్లు తెలిసింది.