Jubilee Hills | శిశు విహార్లో ఆయమ్మలకు 5 నెలలుగా జీతాల్లేవ్.. సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన..!

Follow

జూబ్లీహిల్స్, జూన్ 20: కాంగ్రెస్ ప్రభుత్వం ఆయమ్మ(Ayamma)ల వేతనాలకు కూడా ఎగనామం పెడుతోంది. హైదరాబాద్ యూసుఫ్గూడా మధురా నగర్ లోని శిశు విహార్(Shishu Vihar)లో ఆయమ్మలుగా పనిచేస్తున్న సిబ్బందికి జనవరి నెల నుంచి జీతాలు అందడం లేదు. అనాథ పిల్లల సంరక్షణ కేంద్రమైన శిశు విహార్లో 130 మంది ఆయమ్మలు పని చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఒంటరి మహిళలు, భర్త చనిపోయిన వారు. అనాథ బాలికలకు అన్నీ తామై చూసుకునే అయమ్మల వేతనాల విషయాన్ని సదరు విభాగం అధికారులు పట్టించుకోవడం లేదు. దాంతో, తక్షణమే తమ వేతనాలు చెల్లించాలంటూ సీపీఎం పార్టీ అనుబంధ సీఐటీయూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం శిశు విహార్ వద్ద ఆయమ్మలు ఆందోళనకు దిగారు.
శిశు విహార్లో పని చేస్తున్న ఆయమ్మలకు చట్ట ప్రకారం ప్రతి నెల 7 వ తేదీ లోపు జీతాలు ఇవ్వాలని.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అమలు చేస్తున్న జీ ఓ 60 ప్రకారం రూ. 15,600 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెల వేతనాన్ని 30 రోజులకు లెక్కించి ఇవ్వడంతో రోజుకు రూ. 74 నష్ట పోతున్నారని.. చట్ట ప్రకారం 26 రోజులకు వేతనాన్ని లెక్కించి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ సక్రమంగా వర్తించేలా చూడాలని.. రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా సౌకర్యం కల్పించాలని ఆయమ్మలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

గత ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తినడానికి తిండి లేని పరిస్థితి నేలకొందని.. అద్దె ఇంట్లో ఉంటున్న తాము కిరాయిలు కట్టడం కోసం అప్పులు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంచాలకులు, శిశు విహార్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రాపర్తి అశోక్, గౌరవాధ్యక్షులు ఎం. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
- Sangareddy | అసంపూర్తిగా ఇందిరమ్మ మోడల్ ఇల్లు.. నిధుల లేమా? అధికారుల నిర్లక్ష్యమా?
- NMBA programs | ఎన్ఎమ్బిఏ కార్యక్రమాలు విజయవంతం చేయాలి.. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే
జూబ్లీహిల్స్, జూన్ 20: కాంగ్రెస్ ప్రభుత్వం ఆయమ్మ(Ayamma)ల వేతనాలకు కూడా ఎగనామం పెడుతోంది. హైదరాబాద్ యూసుఫ్గూడా మధురా నగర్ లోని శిశు విహార్(Shishu Vihar)లో ఆయమ్మలుగా పనిచేస్తున్న సిబ్బందికి జనవరి నెల నుంచి జీతాలు అందడం లేదు.