Kattangur : చట్టాలపై ప్ర‌జ‌లు అవగాహన కలిగి ఉండాలి : ఎస్ఐ రవీందర్

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Kattangur : చట్టాలపై ప్ర‌జ‌లు అవగాహన కలిగి ఉండాలి : ఎస్ఐ రవీందర్

కట్టంగూర్. జూన్ 30 : చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. మండలంలోని మల్లారం గ్రామంలో సోమవారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ ప్రకారం ప్రతి ఒక్కరికీ హక్కులు కల్పించబడ్డాయని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హక్కులు ఎంత ముఖ్యమో, పౌరులకు బాధ్యతలు కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రజలందరూ సమానమేనని, కుల, మత, వర్ణ భేదం, వివక్ష, అంటరానితనం రూపుమాపాలన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరి సహకారం అవసరమని, హక్కులను భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పిల్లలను పనికి పంపడం, బాల్య వివాహాలు, డ్రగ్స్ వాడడం, మూఢ నమ్మకాలపై చట్టపరంగా ఎలాంటి శిక్షలు ఉంటాయో ప్రజలకు వివ‌రించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ కుమార్ రెడ్డి, తాసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భాగ్య, పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

​చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. మండలంలోని మల్లారం గ్రామంలో సోమవారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *