KCR | సిగాచి ఫార్మా ప్రమాదంపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దిగ్భ్రాంతి

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Kcr

KCR : సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ స్పందించారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతిచెందడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతులకు తన సంతాపం ప్రకటించారు. మృతుల సంఖ్య ఇంకా పెరగనున్నదనే వార్తలు వినపడుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

ప్రమాదానికి కారణాలపై విచారణ జరిపించాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలన్నారు. చనిపోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

​KCR | సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ స్పందించారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతిచెందడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతులకు తన సంతాపం ప్రకటించారు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *