Khammam Rural : సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి : మోహన్రావు

Follow

ఖమ్మం రూరల్, జూన్ 30 : దేశ వ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు, అసోసియేషన్స్, ఫెడరేషన్లు, వివిధ యూనియన్లు ఇచ్చినటువంటి జులై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్లపల్లి మోహన్రావు స్కీమ్ వర్కర్లకు పిలుపునిచ్చారు. జూలై 9 దేశ సమ్మె జయప్రదం చేయాలని మండలంలో సోమవారం విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సెక్టార్స్ జనరల్ బాడీ సమావేశాలు పల్లెగూడెం, పొన్నెకల్లు రాజీవ్ గృహకల్పలో జరిగినవి.
ఈ సభల్లో మోహన్ రావు మాట్లాడుతూ.. స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్ అయిన తర్వాత పెన్షన్ జీతంలో సగం ఇవ్వాలని, మినీ నుంచి మెయిన్ సెంటర్లుగా మార్చిన సెంటర్లలో హెల్పర్లను నియమించాలని, టీఏ, డీఏ పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం సమ్మె కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్, సిఐటియు జిల్లా నాయకులు రత్నకుమారి, పుష్ప, రేవతి, రాధా, లలిత, రజిత, నాగమణి, సకిన, సునీత, యాదమ్మ, నిర్మల, కవిత, జైనాభి పాల్గొన్నారు.
దేశ వ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు, అసోసియేషన్స్, ఫెడరేషన్లు, వివిధ యూనియన్లు ఇచ్చినటువంటి జులై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్లపల్లి మోహన్రావు స్కీమ్ వర్కర్లకు పిలుపునిచ్చారు.