live-in couple arrested | నవజాత శిశువుల ఎముకలు లభ్యం.. సహజీవనం చేస్తున్న జంట అరెస్ట్

Follow

తిరువనంతపురం: ఇద్దరు నవజాత శిశువులు మరణించారు. మృతదేహాల అవశేషాలు, ఎముకలతో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. శిశువుల మృతి గురించి తెలుసుకున్న పోలీసులు సహజీవనం చేస్తున్న ఆ జంటను అరెస్ట్ చేశారు. (live-in couple arrested) కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 25 ఏళ్ల బవిన్, ల్యాబ్ టెక్నీషియన్ అయిన 23 ఏళ్ల అనీషాకు 2020లో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకోవాలని భావించిన ఈ జంట గత కొన్నేళ్లుగా ఒక ఇంట్లో సహజీవనం చేస్తున్నారు.
కాగా, అనీషాకు మరో వ్యక్తితో సంబంధం ఉందని బవిన్ అనుమానించాడు. దీంతో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో ఉన్న బవిన్ ఆదివారం తెల్లవారుజామున నవజాత శిశువుల అస్థిపంజరాలు, ఎముకలు ఉన్న బ్యాగ్తో త్రిస్సూర్లోని పుదుకాడ్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. అనీషాకు జన్మించిన నవజాత శిశువులకు చెందిన అవశేషాలని తెలిపాడు. మరణించిన శిశువుల ఆత్మలు మోక్షం పొందటం కోసం కర్మకాండలు చేసేందుకు వాటిని భద్రపరిచినట్లు చెప్పాడు.
మరోవైపు ఫోరెన్సిక్ నిఫుణులు ఆ ఎముకలను పరీక్షించారు. నవజాత శిశువులకు చెందినవిగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో సహజీవనం చేస్తున్న బవిన్, అనీషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిశువుల మరణాలపై అనీషాను ప్రశ్నించారు. 2021లో తొలి శిశువు జన్మించినట్లు ఆమె తెలిపింది. అయితే ప్రసవ సమయంలో బొడ్డు తాడు మెడకు చుట్టుకోవడం వల్ల చనిపోయినట్లు ఒకసారి, ఊపిరాడక మొదటి బిడ్డ మరణించినట్లు మరోసారి చెప్పింది.
కాగా, ఇంటి సమీపంలోని స్థలంలో శిశువు మృతదేహాన్ని పాతిపెట్టినట్లు అనీషా తెలిపింది. ఎనిమిది నెలల తర్వాత పాతిన చోట తవ్వి ఎముకలను సేకరించి బవిన్కు ఇచ్చినట్లు ఆమె చెప్పింది. 2024 ఆగస్ట్లో జన్మించిన రెండో శిశువును చంపినట్లు ఒప్పుకున్నది. ఆ శిశువు మృతదేహాన్ని కూడా అదే విధంగా మరోచోట పాతిపెట్టినట్లు తెలిపింది. కొన్ని నెలల తర్వాత అక్కడ తవ్వి ఎముకలను బవిన్కు ఇచ్చినట్లు చెప్పింది.
మరోవైపు ఇద్దరు శిశువుల మరణాలకు సంబంధించి బవిన్, అనీషాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అనీషా రెండుసార్లు గర్భం దాల్చి పిల్లలను కన్న విషయం ఆమె కుటుంబానికి తెలుసా లేదా అన్నది ఆరా తీస్తున్నారు.
Also Read:
Man Kills Daughter | చాక్లెట్ కొనేందుకు డబ్బులు అడిగిన కూతురు.. గొంతునొక్కి చంపిన తండ్రి
Watch: భారీ వర్షాలకు కుంగిన రోడ్డు.. బైక్తోపాటు గుంతలో పడిన వ్యక్తి
live-in couple arrested | ఇద్దరు నవజాత శిశువులు మరణించారు. మృతదేహాల అవశేషాలు, ఎముకలతో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. శిశువుల మృతి గురించి తెలుసుకున్న పోలీసులు సహజీవనం చేస్తున్న ఆ జంటను అరెస్ట్ చేశారు.