Man Kills Daughter | చాక్లెట్ కొనేందుకు డబ్బులు అడిగిన కూతురు.. గొంతునొక్కి చంపిన తండ్రి

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Policevan

ముంబై: మద్యానికి బానిసైన వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. చాక్లెట్ కొనేందుకు డబ్బులు అడిగిన నాలుగేళ్ల కూతురి గొంతునొక్కి చంపాడు. (Man Kills Daughter) ఈ నేపథ్యంలో భార్య ఫిర్యాదుపై పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉద్గిర్ తాలూకాలోని భీమా తండాలో నివసించే బాలాజీ రాథోడ్‌ మద్యానికి బానిస అయ్యాడు. నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో భార్య అతడ్ని వదిలి పుట్టింటికి వెళ్లింది. అయితే నాలుగేళ్ల కుమార్తె ఆరుషి అతడి వద్దనే ఉన్నది.

కాగా, ఆదివారం ఆ బాలిక చాక్లెట్‌ కొనేందుకు తండ్రి బాలాజీ రాథోడ్‌ను డబ్బులు అడిగింది. మద్యం మత్తులో ఉన్న అతడు కుమార్తెపై ఆగ్రహించాడు. చీరతో ఆరుషి గొంతునొక్కి హత్య చేశాడు.

మరోవైపు ఈ విషయం తెలుసుకున్న భార్య వర్ష తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మద్యం మత్తులో కుమార్తెను చంపిన అతడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేసింది. నిందితుడైన బాలాజీ రాథోడ్‌ను అరెస్ట్‌ చేసినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Also Read:

Road Built With Trees Middle | బయటపడిన అధికారుల నిర్లక్ష్యం.. చెట్ల మధ్యలో వంద కోట్లతో రోడ్డు నిర్మాణం

Watch: జలపాతంపైన నీటిలో జారిపడిన మహిళలు.. తర్వాత ఏం జరిగిందంటే?

Man Organises Wife’s Wedding To Lover | మరో వ్యక్తితో భార్యకు సంబంధం.. దగ్గరుండి వారి పెళ్లి జరిపించిన భర్త

​Man Kills Daughter | మద్యానికి బానిసైన వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. చాక్లెట్ కొనేందుకు డబ్బులు అడిగిన నాలుగేళ్ల కూతురి గొంతునొక్కి చంపాడు. ఈ నేపథ్యంలో భార్య ఫిర్యాదుపై పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *