MLC Kodandaram | భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ కోదండరాం

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Mlc Kodandaram

MLC Kodandaram : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీ ఏర్పాటైంది. ఎమ్మెల్సీ ఎం.కోదండరాం(M. Kodandaram)ను చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ప్రకటించింది. సంచాలకులుగా ఉన్న డా. మామిడి హరికృష్ణ ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. తెలంగాణ సాహిత్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న పలువురిని సభ్యులుగా నియమించింది ప్రభుత్వం.

కమిటీ సభ్యులుగా సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ గుమ్మడి వెన్నెల, సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు డా. అలేఖ్య పుంజాల, సినీ గీత రచయిత డా. సుద్దాల అశోక్ తేజ, కవి దర్శకుడు బి.నర్సింగరావు, కవి జయరాజ్, రచయిత డా.సంగిశెట్టి శ్రీనివాస్, విమర్శకులు డా.కోయి కోటేశ్వరరావు, రచయిత డా.పసునూరి రవీందర్, జానపద కళాకారులు దరువు ఎల్లన్న, అంతుడుపుల నాగరాజు, ఏపూరి సోమన్న, డా. ఒగ్గు రవి కుమార్, నేర్నాల కిషోర్, పల్లె నరసింహ, దర్శకుడు డా.ఖాజా పాషా, కవి డా.యాకూబ్, రచయిత డా.జూకంటి జగన్నాథం, కళాకారుడు దరువు అంజన్నలను నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

​MLC Kodandaram : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీ ఏర్పాటైంది. ఎమ్మెల్సీ ఎం.కోదండరాం(M. Kodandaram)ను చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ప్రకటించింది. సంచాలకులుగా ఉన్న డా. మామిడి హరికృష్ణ ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *