PM Modi: మోదీ సొంత గ్రామంలో అరుదైన నాణేలు లభ్యం.. గ్రీకు చక్రవర్తి కాలం నాటి..

Follow

ప్రధాని మోడీ సొంత గ్రామం గుజరాత్లోని వాద్నగర్లో అరుదైన నాణేలు లభ్యమయ్యాయి. 2014 నుంచి 2024 దశాబ్ద కాలంగా పురావస్తు శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో ఆశ్చర్యపరిచే విధంగా అరుదైన నాణేలు బయటపడ్డాయి. ఇండో-గ్రీకుకు చెందిన నాణేల అచ్చులు లభ్యమయ్యాయి. ఈ తవ్వకాల్లో 37 టెర్రకోట నాణేల అచ్చులను కనుగొన్నారు. కాస్టింగ్ పద్ధతిలో ఉన్న ఈ అచ్చులు ఇండో-గ్రీకు చక్రవర్తి అపోలోడోటస్-2 కాలానికి చెందినవిగా గుర్తించారని ASI సూపరింటెండెంట్ డా. అభిజిత్ అంబేకర్ తెలిపారు.
ఈ సందర్భంగా ASI సూపరింటెండెంట్ డా. అభిజిత్ అంబేకర్ మాట్లాడుతూ..ఈ అచ్చులు డై-స్ట్రక్డ్ ఒరిజినల్ అచ్చుల మాదిరిగా కాకుండా.. కాస్టింగ్ పద్ధతిలో ఉన్నాయని చెప్పారు. ఈ అచ్చులు అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రానికి ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉన్న గుజరాత్, డ్రాచ్మా వాణిజ్య మార్గాల ద్వారా జరిగి ఉండొచ్చని భావిస్తున్నట్టుగా చెప్పారు. ఈ అచ్చులు 5-10 శతాబ్దాల నాటి అచ్చులుగా సూచిస్తున్నట్టుగా ఆర్కియాలజిస్ట్ డాక్టర్ అభిజిత్ అంబేకర్ తెలిపారు.
మరిన్ని జాతీయ వివరాల కోసం క్లిక్ చేయండి..
ఈ అచ్చులు అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రానికి ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉన్న గుజరాత్, డ్రాచ్మా వాణిజ్య మార్గాల ద్వారా జరిగి ఉండొచ్చని భావిస్తున్నట్టుగా చెప్పారు. ఈ అచ్చులు 5-10 శతాబ్దాల నాటి అచ్చులుగా సూచిస్తున్నట్టుగా ఆర్కియాలజిస్ట్ డాక్టర్ అభిజిత్ అంబేకర్ తెలిపారు.