Reactor Blast: భారీ క్రేన్ లతో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..!

Follow

Reactor Blast: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం సీగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ పేలుడు ధాటికి పరిశ్రమ తునాతునకలైంది. ఇప్పటివరకు 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో 10 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Read Also:Kubera : పదేళ్లకే అన్నీ తెలుస్తున్నాయ్.. శేఖర్ కమ్ముల షాకింగ్ కామెంట్స్
ఉదయం 9 గంటల సమయంలో పరిశ్రమలో పని సాగుతున్న సమయంలోనే రియాక్టర్ భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో కంపెనీకి చెందిన షెడ్, గ్రౌండ్ +2 అంతస్తుల అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కుప్పకూలిపోయాయి. రెండో అంతస్తులో పనిచేస్తున్న సిబ్బంది పేలుడుతో కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. రియాక్టర్ చుట్టుపక్కల ఉన్న 8 మంది సజీవ సమాధి అవ్వగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు మృతిచెందారు.
Read Also:Sriram Venu: ఆర్టికల్ స్ఫూరితో “తమ్ముడు” కథ.. ట్రెండ్ ఫాలో అవుతున్నాం!
ప్రస్తుతం మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భారీ క్రేన్లు, హైడ్రాలిక్ పరికరాలతో శిథిలాలను తొలగిస్తున్నాయి. మరో 3 గంటల్లో శిథిలాల తొలగింపు పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఈ ఘటన పట్ల పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై మరొకసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Reactor Blast: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం సీగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ పేలుడు ధాటికి పరిశ్రమ తునాతునకలైంది. ఇప్పటివరకు 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో 10 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. Read Also:Kubera : పదేళ్లకే