Road Accident | ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆటో.. ఇద్దరు యువకులు మృతి

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Road Accident

చిన్నశంకరంపేట : ద్విచక్రవాహానాన్ని ఓవర్‌టేక్‌ చేయబోయిన ఆటో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును( RTC Bus) ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు (Youth Died) కోల్పోయారు. పోలీసులు, స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం .. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లికి చెందిన శ్రీకాంత్‌(25), కౌడిపల్లికి చెందిన వడ్డె నరేశ్‌(24) కలసి మెదక్‌ వైపు ఆటోలో వెళ్తున్నారు.

మెదక్‌ మండలం మంబోజిపల్లి నర్సాపూర్‌-మెదక్‌ జాతీయ రహదారిపై నిజాంషుగర్‌ ఫ్యాక్టరీకి సమీపంలో ముందుగా వెళ్తున్న బైక్‌ను ఓవర్‌టేక్‌ చేయబోయి ఎదురుగా బాలానగర్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆటో ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడి మృతి చెందారు. మెదక్‌ రూరల్‌ సిఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్సై మురళీ ఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాలను మెదక్‌ మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

​Road Accident | ద్విచక్రవాహానాన్ని ఓవర్‌టేక్‌ చేయబోయిన ఆటో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *