Stock Market | అమ్మకాల ఒత్తిడి.. నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Domestic Stock Markets

Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. మెటల్, ఆటో, రియాల్టీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో బలమైన అమ్మకాలతో మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. అయితే, పీఎస్‌యూ బ్యాంక్‌, ఐటీ, మీడియా రంగ్లాలో కొనుగోళ్లతో నిఫ్టీ 25,500 ఎగువన ముగిసింది. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ 84,027.33 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 84,099.53 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్‌.. అత్యల్పంగా 83,482.13 పాయింట్లకు పడిపోయింది. చివరకు 452.44 పాయింట్లు తగ్గి 83,606.46 వద్ద ముగిసింది. నిఫ్టీ 120.75 పాయింట్లు తగ్గి 25,517.05 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.6శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.8శాతం పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ కూడా రికార్డు స్థాయిలో 57,614.50 పాయింట్లకు పెరిగింది. ఆ తర్వాత 0.2శాతం తగ్గి 57,312.75 వద్ద ముగిసింది. నిఫ్టీలో టాటా కన్స్యూమర్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హీరో మోటోకార్ప్, మారుతి సుజుకి ప్రధానంగా నష్టాలను చవిచూశాయి.

ట్రెంట్, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్, జియో ఫైనాన్షియల్ లాభపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2.6 శాతం పెరిగింది. ఫార్మా ఇండెక్స్ 0.5 శాతం పెరిగింది. రియాల్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, మెటల్ నష్టాల్లో ముగిశాయి. తెలంగాణలో రియాక్టర్ పేలుడు కారణంగా సిగాచి ఇండస్ట్రీస్ షేర్లు 11శాతం పతనమయ్యాయి. ఐడీబీఐఐ బ్యాంక్ షేర్లు ఒకశాతం పెరిగాయి. ఎండీ-సీఈ వో రాజీనామాతో కర్నాటక బ్యాంక్‌ షేర్లు 5శాతం పడిపోయాయి. దీపక్ ఫెర్టిలైజర్స్, సిటీ యూనియన్ బ్యాంక్, ఈఐడీ ప్యారీ, లారస్ ల్యాబ్స్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, లాయిడ్స్ మెటల్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఎస్‌ఆర్‌ఎఫ్‌, పూనవాలా ఫిన్‌కార్ప్, అబాట్ ఇండియా, రామ్‌కో సిమెంట్స్, ఎల్‌టీ ఫైనాన్స్, రెడింగ్టన్, జిల్లెట్ ఇండియా, హ్యుందాయ్ మోటార్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, మాక్స్ ఫైనాన్షియల్, సోలార్ ఇండస్ట్రీస్ వంటి 150 కంటే ఎక్కువ స్టాక్‌లు బీఎస్‌ఈలో 52 వారాల గరిష్ట స్థాయిని తాకాయి.

​Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. మెటల్, ఆటో, రియాల్టీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో బలమైన అమ్మకాలతో మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. అయితే, పీఎస్‌యూ బ్యాంక్‌, ఐటీ, మీడియా రంగ్లాలో కొనుగోళ్లతో నిఫ్టీ 25,500 ఎగువన ముగిసింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *