Supreme Court | సుప్రీంకోర్టులో లలిత్ మోదీకి ఎదురుదెబ్బ..! పిటిషన్‌ని తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Lalith Modi

Supreme Court | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్‌ అయిన లలిత్‌ మోదీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఈడీ తనకు విధించిన జరిమానాను బీసీసీఐ చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని లలిత్‌ మోదీ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఫెమా (FEMA) నిబంధనల ఉల్లంఘించారంటూ ఈడీ ఆయనకు రూ.10.65కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. అయితే, గత సంవత్సరం డిసెంబర్ 19న బాంబే హైకోర్టు లలిత్ మోదీకి రూ.లక్ష జరిమానా విధించింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘించినందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విధించిన రూ.10.65 కోట్ల జరిమానాను చెల్లించాలని బీసీసీఐని ఆదేశించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. లలిత్ మోదీ తన పిటిషన్‌లో తాను బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యానని, ఆ సమయంలో ఐపీఎల్‌ పాలక మండలి చైర్మన్‌గా ఉన్నానని గుర్తు చేశారు.

ఆ సమయంలోనే ఈ వ్యవహారం జరిగిందని, బీసీసీఐ నిబంధనల ప్రకారం సంస్థ ప్రతినిధులు ఎదుర్కొనే చట్టపరమైన ఖర్చులను సంస్థే భరించాలని మోదీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఆయన వాదనలను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌ను కొట్టేయడంత పాటు రూ.లక్ష జరిమానా విధించింది. అయితే, హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం బాంబే హైకోర్టు తీర్పును సమర్థించింది. బీసీసీఐ జరిమానా చెల్లించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. అయితే, చట్ట ప్రకారం ఈ కేసులో తనను తాను రక్షించుకునేందుకు లలిత్ మోదీకి పూర్తి హక్కు ఉందని ధర్మాసనం పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఐపీఎల్‌ చైర్మన్‌గా వ్యవహరించిన సమయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. దాంతో ఆయన ఆయన 2010లో దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఆయన లండన్‌లో నివాసం ఉంటున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయనను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

​Supreme Court | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్‌ అయిన లలిత్‌ మోదీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఈడీ తనకు విధించిన జరిమానాను బీసీసీఐ చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని లలిత్‌ మోదీ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *