Viral Video: రన్నింగ్ ట్రైన్లో రక్తం వచ్చేలా కొట్టుకున్న మహిళలు.. వైరల్ అవుతున్న వీడియో!

Follow

ముంబై లోకల్ ట్రైన్లలో ఉండే రద్దీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిత్యం వేల సంఖ్యలో జనాలు ముంబైలోని లోకల్ ట్రైన్స్లో ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. ఇలా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ప్లేస్ కోసం గోడవలు జరిగిన సంఘటనలు మన ఇప్పటికే ఎన్నో చూశాం. తాజాగా మరోసారి అలాంటి ఘటను సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ముంబై నగరంలోని లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న ఓ ఇద్దరు మహిళలు, పరస్పరం రక్తం వచ్చేలా దాడి చేసుకున్నారు. అక్కడే ఉన్న కొందరు మహిళలు ఈ తతంగాన్నంత వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. చర్చిగేట్ నుంచి విరార్కు వెళ్తున్న ఓ లేడీస్ స్పెషల్ లోకల్ ట్రైన్ ప్రయాణికులతో నిండిపోయింది. ఈ క్రమంలో రైల్వే డోర్ వద్ద నిలబడిన ఇద్దరు మహిళల మధ్య చిన్నగా వివాదం మొదలైంది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో వివాదం కాస్తా పెద్దగా మారి జుట్లు పట్టుకొని కొట్టుకునే వరకు వెళ్లింది. అంతటితో ఆడకుండా ఇద్దరు రక్తలు వచ్చేలా కొట్టుకున్నారు. పక్కనే ఉన్న ఇతర ప్రయాణికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారు ఆగలేదు. దీంతో వారు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు తర్వాతి స్టేషన్లో వారిని దించేశారు. ఆ తర్వాత వారిని అక్కడి నుంచి భయాందర్ రైల్వే పోలీస్ స్టేషన్కు తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ముంబై నగరంలోని లోకల్ ట్రైన్లో ఇద్దరు మహిళల మధ్య మొదలైన వివాదం రక్తాలు వచ్చేలా కొట్టుకునే స్థాయికి చేరుకుంది. ఈ ఘటన చర్చిగేట్ నుంచి విరార్ వెళ్తున్న లోకల్ ట్రైన్లోని లేడీస్ స్పెషల్ కోచ్లో వెలుగు చూసింది. మహిళలు గొడవపడుతున్న దాన్ని వీడియో తీసిన ఓ మహిళ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అది వైరల్గా మారింది.