Yellandu : కలెక్టర్ జితేశ్ వి పాటిల్కు అఖిలపక్ష నాయకుల వినతి

Follow

ఇల్లెందు, జూన్ 30 : ఇల్లెందు పర్యటనకు వచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ను అఖిలపక్షం నాయకులు కలిసి పలు సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ జెకె 5 విస్తరణ పేరుతో మొదలు పెడుతున్న ఓసిలో తమ ప్రాంతం ఉందని, దీంతో ఇండ్లు, పొలాలు కోల్పోతూ నిర్వాసితులుగా మారుతున్నట్లు తెలిపారు. ఇక్కడ సర్వే చేసిన ఇళ్లకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలన్నారు. గతంలో జెకె 5 ఓసి నిర్వహణలో వారికి ఆర్ అండ్ ఆర్ వర్తింపజేసినట్లు తెలిపారు. అదే విధంగా తమకు అందివ్వాలని కోరారు.
ఎఫెక్ట్ ఏరియాలో ఉన్న ప్రాంతాలను సింగరేణి దత్తత తీసుకోవాలని ముందుగా వాటిని ప్రభుత్వానికి అప్పజెప్పి పట్టాలు ఇప్పించాలన్నారు. అలాగే సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు పిల్లలు ఉంటున్న క్వార్టర్స్ ను వారికి కేటాయించాలన్నారు. సింగరేణి సంస్థ భవిష్యత్లో చేపట్టబోయే టెండర్లలో వారికి అవకాశం కల్పించాలన్నారు. స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఎఫెక్ట్ ఏరియాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సింగరేణి సంస్థకు దిశా నిర్దేశం చేయాలని వారు కలెక్టర్ను కోరారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్ని ఇల్లులు పోతున్నాయని, వ్యవసాయ భూమి ఎంత పోతుందని అడుగగా 250 పైగా ఇండ్లు, వ్యవసాయ భూములు పోతున్నట్లు చెప్పారు. అలాగే దాదాపు 1,800 కుటుంబాలు ఎఫెక్ట్ ప్రాంతంలో ఉన్నాయని తెలిపారు. ఈ అంశాలను పరిశీలించి త్వరలో సింగరేణి అధికారులతో మాట్లాడనున్నట్లు కలెక్టర్ హామీ ఇచ్చినట్లు కమిటీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సురేందర్, మాజీ సర్పంచ్ ధనసరి స్రవంతి, వడ్ల శ్రీను, యెట్టి హరికృష్ణ, చాందావత్ రమేశ్బాబు, ధనసరి రాజు, భాస్కర్, మంచాల వెంకటేశ్వర్లు, క్లింట్ రొచ్, గుగులోత్ కృష్ణ ,సుల్తానా, మొగిలి, లాలు, నాని, శ్రీనివాస్, స్థానికులు పాల్గొన్నారు.
ఇల్లెందు పర్యటనకు వచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ను అఖిలపక్షం నాయకులు కలిసి పలు సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతూ వినతిపత్రం అందజేశారు.